పురుగు మందులు: తెలివికి తెగులు!
వ్యవసాయంలో పురుగు మందుల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. దీంతో పాటే అవి మోసుకొచ్చే దుష్ప్రభావాలూ విస్తరిస్తున్నాయి. దీర్ఘకాలం పురుగు మందుల ప్రభావానికి గురయ్యే వారిలో విషయ గ్రహణ శక్తి లోపిస్తున్నట్టు ఫ్రాన్స్ పరిశోధకుల తాజా అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా ద్రాక్ష తోటల్లో పురుగు మందులను విపరీతంగా వినియోగిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ద్రాక్ష తోటల్లో 20 ఏళ్లుగా పని చేస్తున్న వారిని అధ్యయనం కోసం ఎంచుకున్నారు. రకరకాల పరీక్షలతో వారి తెలివితేటలు, స్పందన-ప్రతిస్పందన తీరుతెన్నులను పరిశీలించారు. పురుగు మందుల ప్రభావానికి నేరుగా గురయ్యే వారిలో.. అంటే పురుగు మందులను కలపటం, చల్లటం వంటి పనులు చేసే వారిలో విషయగ్రహణ శక్తి బాగా తగ్గుతున్నట్టు తేలింది. ఇందులో కొద్దిపాటి లోపం ఉన్నా అల్త్జెమర్స్, డిమెన్షియా వంటి మతిమరుపు వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
tele
ReplyDeleteyour blog is so effortless to read, i like this article, so maintain posting far more